వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్‌లో నకిలీ నక్సల్‌ హతం

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నకిలీ నక్సలైట్‌ హతమయ్యాడు. ఉరవకొండ ప్రాంతంలో ప్రజలను భయాందోళనలకు గురి చేసి బలవంతపు వసూళ్లకు ఈ నకిలీ నక్సలైట్‌ ముఠా పాల్పడుతూ వచ్చిందని పోలీసులు చెప్పారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లక్కవరం గ్రామ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మరణించిన నకిలీ నక్సలైట్‌ను సుంకన్నగా గుర్తించారు. గిరిజన రైతాంగ దళం పేరుతో అతను తన కార్యకలాపాలను కొనసాగించాడని పోలీసులు చెప్పారు. మంగళవారం ఉదయం కూంబింగ్‌ నిర్వహిస్తున్న తమకు ఈ ముఠా ఎదురైందని, తమను చూసి ముఠా సభ్యులు తాము ఎదురు కాల్పులు జరిపామని, అందులో సుంకన్న మరణించాడని, మరో నలుగురు పారిపోయారని పోలీసులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X