వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్కౌంటర్లో నకిలీ నక్సల్ హతం
అనంతపురం: అనంతపురం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక నకిలీ నక్సలైట్ హతమయ్యాడు. ఉరవకొండ ప్రాంతంలో ప్రజలను భయాందోళనలకు గురి చేసి బలవంతపు వసూళ్లకు ఈ నకిలీ నక్సలైట్ ముఠా పాల్పడుతూ వచ్చిందని పోలీసులు చెప్పారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లక్కవరం గ్రామ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మరణించిన నకిలీ నక్సలైట్ను సుంకన్నగా గుర్తించారు. గిరిజన రైతాంగ దళం పేరుతో అతను తన కార్యకలాపాలను కొనసాగించాడని పోలీసులు చెప్పారు. మంగళవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న తమకు ఈ ముఠా ఎదురైందని, తమను చూసి ముఠా సభ్యులు తాము ఎదురు కాల్పులు జరిపామని, అందులో సుంకన్న మరణించాడని, మరో నలుగురు పారిపోయారని పోలీసులు చెప్పారు.
Story first published: Tuesday, July 29, 2003, 23:53 [IST]