వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మందుపాతరకు 10 మంది పోలీసులు బలి
భువనేశ్వర్: ఒరిస్సా రాష్ట్రంలో మందుపాతరపేల్చిన సంఘటనలో పది మంది పోలీసులు మరణించారు. మల్కాంగిరి జిల్లాలో నక్సల్స్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
మల్కాంగిరి జిల్లాలో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. పోలీసులు కూంబింగ్ నిర్వహించి బెజాంగ్బాదా గ్రామం నుంచి తిరిగి వస్తుండగా నక్సలైట్లు మందుపాతరపేల్చారు. ఈ ఘోర సంఘటన కలిమెల పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మరణించినవారిలో ఇద్దరు సిఆర్పిఎఫ్జవాన్లు ఉన్నారు.
Comments
Story first published: Wednesday, July 30, 2003, 23:53 [IST]