వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పుష్కర లోపాలపై బాబు ఆరా
హైదరాబాద్: గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో లోటుపాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. పుష్కరాలు జరుగుతున్న ఏడు జిల్లాల కలెక్టర్లతో ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి ఏర్పాట్లపై, వివిధ పనుల నిర్వహణపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. దీపధూప నైవేద్యాలు సమర్పించడంలో అలసత్వం గురించి ఆయనకు ఫిర్యాదులుఅందాయి. పుష్కర ఏర్పాట్లను, వివిధ పనుల నిర్వహణను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్కు ముందు కొద్దిసేపు ఫోన్లు మొరాయించాయి. దీంతో ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Story first published: Thursday, July 31, 2003, 23:53 [IST]