వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒత్తిళ్లకు లోను కాలేదు: పేర్వారం
హైదరాబాద్: పోలీసు డైరెక్టర్ జననరల్ (డిజిపి) పదవిలో తాను ఏ విధమైన ఒత్తిళ్లకు లోను కాలేదనిపేర్వారం రాములు చెప్పారు. డిజిపిగా పదవీ విరమణ చేస్తున్నపేర్వారం రాములను పోలీసు అధికారుల సంఘం సన్మానించి, ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తాను ఎవరికీ భయపడలేదని, పక్షపాతంతో వ్యవహరించలేదని, కులంపేరు చెప్పుకొని వచ్చినవారికి పనులు చేసి పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. తన 32 ఏళ్లసర్వీసులో తనకు సహకరించిన సహచరులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తనపైవిశ్వాసం ఉంచి తనకు డిజిపి పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.పేర్వారం రాములుకు డిజిపిగా నియమితులైన ఎస్.ఆర్. సుకుమార మెమెంటో బహూకరించారు.
Comments
Story first published: Thursday, July 31, 2003, 23:53 [IST]