వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిగ్‌ 21లో ఎగిరొచ్చిన జార్జి

By Staff
|
Google Oneindia TeluguNews

అంబాలా: రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ శుక్రవారంమిగ్‌ 21 యుద్ధ విమానంలో ప్రయాణం చేశారు.మిగ్‌ 21 యుద్ధ విమానాలను ఎగిరే శవపేటికలుగా అభివర్ణించిన నేపథ్యంలో ఆయనఅందులో ప్రయాణానికి పూనుకున్నారు.

వింగ్‌ కమాండర్‌ ఎన్‌. హరీష్‌తో పాటు ఫెర్నాండెజ్‌మిగ్‌ 21లో ఉదయం 25 నిమిషాల పాటు తిరిగి వచ్చారు. ఆయనఅంబాలా నుంచి బయలుదేరి కురుక్షేత్ర, ఇతర పట్టణాలమీదుగా ప్రయాణించి ఉదయం గం.10.10 నిమిషాలకు సురక్షితంగా దిగారు. ఉదయం వర్షం పడడంతోవిమానం బయలుదేరడంలో రెండు గంటల పాటు జాప్యం జరిగింది.మిగ్‌ 21 విమానాల్లో లోపాలు లేవని మంత్రి కితాబు ఇచ్చారు.వీటిని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. పాత వాటిని మాత్రం క్రమేణా తొలగించి, కొత్తవి ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X