వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మిగ్ 21లో ఎగిరొచ్చిన జార్జి
అంబాలా: రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ శుక్రవారంమిగ్ 21 యుద్ధ విమానంలో ప్రయాణం చేశారు.మిగ్ 21 యుద్ధ విమానాలను ఎగిరే శవపేటికలుగా అభివర్ణించిన నేపథ్యంలో ఆయనఅందులో ప్రయాణానికి పూనుకున్నారు.
వింగ్ కమాండర్ ఎన్. హరీష్తో పాటు ఫెర్నాండెజ్మిగ్ 21లో ఉదయం 25 నిమిషాల పాటు తిరిగి వచ్చారు. ఆయనఅంబాలా నుంచి బయలుదేరి కురుక్షేత్ర, ఇతర పట్టణాలమీదుగా ప్రయాణించి ఉదయం గం.10.10 నిమిషాలకు సురక్షితంగా దిగారు. ఉదయం వర్షం పడడంతోవిమానం బయలుదేరడంలో రెండు గంటల పాటు జాప్యం జరిగింది.మిగ్ 21 విమానాల్లో లోపాలు లేవని మంత్రి కితాబు ఇచ్చారు.వీటిని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. పాత వాటిని మాత్రం క్రమేణా తొలగించి, కొత్తవి ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, August 1, 2003, 23:53 [IST]