శంకర్రావు ఘటనపై విచారణకై డిమాండ్
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షఉపనేత శంకర్రావును టీటీడీ అవమానించినఉదంతంపై సీబీఐ చేత విచారణ జరిపించాలనికాంగ్రెస్ డిమాండ్ చేసింది. కొద్ది రోజుల క్రితంమహబూబ్ నగర్ లో ఓ ఆలయంలో తిరుమల తిరుపతిదేవస్థానం అధికారులు శంకర్రావును అనుమానించారనిఆరోపణ. దీనికి నిరసనగా శంకర్రావు శుక్రవారం ఒక రోజునిరసన దీక్షను చేపట్టారు.
సికింద్రాబాద్ లోని దీక్షాశిబిరంలో కాంగ్రెస్ నేతలందరూ పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దళితులపై వివక్షనుప్రదర్శిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెస్సార్ విమర్శించారు. క్యాబినెట్ లోనూ దళితులపైచంద్రబాబు వివక్ష చూపుతున్నారని సీఎల్పీ నేతవై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. దళిత నేతలపై ఆరోపణలువస్తేనే రాజీనామా చేయిస్తోన్న ముఖ్యమంత్రిమిగతా వారిపై ఎందుకు అలక్ష్యం ప్రదర్శిస్తున్నారోదీన్ని బట్టే అర్థమవుతుందన్నారు. శంకర్రావుఉదంతంపై సీబీఐ చేత విచారణ జరిపించాలనిఆయన డిమాండ్ చేశారు.