వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపి అధ్యక్షుడు ఇంద్రసేనుడే!
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడిగా నల్లు ఇంద్రసేనా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష పదవికి శనివారం నామినేషన్లు వేయాల్సి ఉంది.
నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఇంద్రసేనా రెడ్డి తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికవిషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటిస్తారు. మరో 48 మంది పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేస్తానని వరంగల్ జిల్లాకు చెందినసీనియర్ పార్టీ నేత జంగారెడ్డి అసమ్మతి రాగంవినిపించారు. అయితే ఆయన చివరి నిమిషంలో తన ప్రయత్నాన్నివిరమించుకున్నారు.
Comments
Story first published: Saturday, August 2, 2003, 23:53 [IST]