మాకు ఢోకా లేదు: చంద్రబాబు
హైదరాబాద్: అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినంత కాలం తెలుగుదేశం పార్టీకి డోకా లేదని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడువిశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన శనివారం పార్టీ ప్రచార సమన్వయకర్తల సమావేశంలో ప్రసంగించారు.
కాంగ్రెస్ను శాశ్వతంగా ప్రతిపక్షంలోకూర్చోబెట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. సమర్థ నాయకత్వాన్నిఅందించడంలో తమ పార్టీ విజయం సాధించిందని, ఎక్కడిక్కడ పార్టీకి సమర్థ నాయకత్వం ఏర్పడిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు అనుసరించే పరిస్థితి వచ్చేసిందని ఆయన అన్నారు. తాము దూరదృష్టితో ఆలోచిస్తున్నామని, రాష్ట్రాన్ని ఇతరులకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకువిజన్ 2020 రూపొందించుకున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆయనవిమర్శిస్తున్నారు.
కర్ణాటక అక్రమ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ అడ్డు పడుతోందని, స్థానిక సంస్థల అధికారాలపై మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన అన్నారు.