వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
త్వరలో ద్వంద్వ పౌరసత్వం: అద్వానీ
పూణ: ఈ ఏడాది చివర్లోగా ద్వంద్వ పౌరసత్వ చట్టం అమల్లోకి తెస్తామని ఉపప్రధాని ఎల్.కె.అద్వానీ తెలిపారు. ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో నివసిస్తోన్న భారతీయులకు ఈ ద్వంద్వ పౌరసత్వం కల్పిస్తామని ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రవాసభారతీయుల సదస్సు సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. పూణకు చెందిన ఓవిద్యాసంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం అద్వానీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓవిద్యార్ధి అడిగిన ప్రశ్నకు అద్వానీ సమాధానమిస్తూ..డిసెంబర్ లోగా చట్టం తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది మేలో ఇందుకు సంబంధించి బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
విదేశాల్లో నివసిస్తోన్న భారతీయులు ఆ దేశపు పౌరసత్వన్ని కలిగి ఉంటూనే భారతదేశపు పౌరసత్వాన్ని కూడా కలిగి ఉంటారని తెలిపారు. గతంతో పోల్చితే ఇప్పుడు మేథోవలస తగ్గిందని అద్వానీవివరించారు. మనదేశంలోనే ఇప్పుడు మంచి అవకాశాలున్నాయని తెలిపారు.
Comments
Story first published: Sunday, August 3, 2003, 23:53 [IST]