బీజేఎల్పీ నేతగా కంభంపాటి హరిబాబు
హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్.ఇంద్రాసేనా రెడ్డి పగ్గాలు చేపట్టారు. ఆదివారం నాడు ఆయన చిలకం రామచంద్రారెడ్డి నుంచి లాంఛనంగా బాధ్యతలుస్వీకరించారు. ఆదివారం నాడు పార్టీ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడిగా ఎన్.ఇంద్రాసేనారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. అంతకుముందు పార్టీ నేతలు ఇంద్రాసేనారెడ్డిపేరును ప్రతిపాదించగా, పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంకృపాల్ సిన్హా ఇంద్రాసేనుడు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారికంగా ప్రకటించారు.
అనంతరం ఆయన లాంఛనంగా బాధ్యతలుస్వీకరించారు. ఇప్పుడు ను పార్టీ ఎన్నుకొంది. కె.లక్ష్మణ్ కూడా ఈ పదవికి బరిలో ఉన్నప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలు హరిబాబు వైపే మొగ్గుచూపడంతో పదవి ఆయనకే దక్కింది.
అనంతరం ఇంద్రాసేనారెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రఅసెంబ్లీలో సంఖ్యాబలం పెంచుకునేందుకు పార్టీ నేతలంతా నడుంబిగించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో ఊసు లేకుండా పోతాయన్నారు.