వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యపై ఒకే వైఖరి: వాజ్‌ పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్యపై తమ ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ప్రధానమంత్రి అటల్‌బిహారీ వాజ్‌ పేయి స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం ప్రధాని చేసిన వ్యాఖ్యలపై రేగుతోన్నవివాదానికి తెరదించుతూ..ఆయన ఆదివారం అయోధ్యపై ఎన్డీఏ ప్రభుత్వం వైఖరివివరించారు. అయోధ్య పరిష్కారం పరస్పర చర్చల ద్వారా, కోర్టు ద్వారానే సాధ్యమనేది ఎన్డీఏ సర్కార్‌ అభిప్రాయం. ఇందులో ఎటువంటి మార్పు లేదని వాజ్‌పేయి న్యూఢిల్లీలోని బీజేపీ కార్యకర్తల సమావేశంలో అన్నారు.

ఇటీవల నా వ్యాఖ్యలపైవివాదాన్ని సృష్టిస్తున్నారు కొందరు. గుడి కట్టాలని మేం ఎప్పట్నుంచో చెపుతున్నాం. అయితే, అది ఇరుపక్షాలఅంగీకారం వల్లే కావాలన్నది మా అభిమతం.అందులో మార్పే లేనప్పుడు వివాదం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.

పరమహంస దహనసంస్కరణల సందర్భంగా ప్రధాని గుడి కట్టి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. దీనిపైవిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. సోమవారం నాటి పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఈఅంశాన్ని లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X