వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నదుల లింక్‌ జరగాల్సిందే: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: జల సమస్య పరిష్కారానికి నదుల అనుసంధానం అవసరమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన సోమవారం రాజమండ్రిలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

జలం జాతీయ సంపద అని, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయనచెప్పారు. నదుల అనుసంధానంపై 2004 ఫిబ్రవరి నాటికిటాస్క్‌ఫోర్స్‌ సమీక్ష పూర్తి చేస్తుందని, దీంతో లాంఛనంగా నదుల అనుసంధానానికిశ్రీకారం చుడుతారని ఆయన చెప్పారు. నదుల అనుసంధానానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయనకోరారు. దేశంలో పలు జీవనదులున్నాయని, చాలా ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయని, దీని వల్ల పంటలు కొట్టుకుపోతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నీటిని సద్వినియోగం చేసుకునే నదుల అనుసంధానం వల్ల సమస్యలు కూడా పరిష్కారమవుతాయని ఆయనవివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X