వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజమండ్రి పుష్కరాల వద్ద తొక్కిసలాట
రాజమండ్రి: రాజమండ్రి పుష్కర ఘట్టం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. సోమవారం ఉదయం పదిన్నర, 11 గంటల మధ్య ఈ తొక్కిసలాట జరిగింది.
స్నానం చేయడానికి వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో స్నానాల కోసం క్యూ కట్టిన భక్తులను ఆపేశారు. గేట్లు తీసిన సందర్భంలో మూకుమ్మడిగా తోసుకుపోవడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు రంగంలోకి దిగి యాత్రికులను అదుపులోకి తెచ్చారు. తొక్కిసలాటలో చాలా మంది కింద పడిపోయారు.
రాజమండ్రి సమీపంలోని 13 స్నాన ఘట్టాలు యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి. శని, ఆదివారాల్లో రాజమండ్రి నగరానికి యాత్రికులు వెల్లువలా వచ్చి పడ్డారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. యాత్రికుల ప్రవాహం తగ్గకపోవడంతో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి నగరంలో పలు ఏర్పాట్లు చేశారు.
Comments
Story first published: Monday, August 4, 2003, 23:53 [IST]