హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి
శ్రీనగర్: శ్రీనగర్ సమీపంలో ఒక హెలికాప్టర్ కూలి మంగళవారం ఉదయం ఆరుగురు మరణించారు. మరణించినవారిలో ఒక మహిళ, హెలికాప్టర్పైలట్ కూడా ఉన్నారు.గందెర్బాల్ పవర్ స్టేషన్ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది.
సిక్స్ సీటర్ బిఇఎల్ 407 హెలికాప్టర్ నెహ్రూ హెలిపాడ్ నుంచి అమర్నాథ్కు బయలుదేరింది. ఆ తర్వాత శ్రీనగర్కు 23 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. అందులోని ఐదుగురు అక్కడికక్కడే మరణించగా ఒకరు సౌరా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అసువులు బాశారు. ఈ హెలికాప్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది. మృతులను వినీత్ కసాడియా, ఓమ్ నారాయణ్, శ్రీమతి సంగీతా నారయణ్, పైలట్ జె.ఎస్. కోహ్లోన్లుగా గుర్తించారు. శ్రీమతి కసాడియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
ఈ ప్రభుత్వ హెలికాప్టర్ యాత్రికులను, విఐపిలను అమర్నాథ్కు చేరవేస్తోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్బల్ సోమవారం నాడు అమర్నాథ్ యాత్రకు ఇదే హెలికాప్టర్లో వెళ్లారు.