వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Pushkaralu Gallery
న్యూఢిల్లీ: ఏఅంశమూ లేకపోవడంతో ప్రతిపక్షాలు అయోధ్యఅంశంపై విమర్శలు చేస్తున్నాయని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీవిమర్శించారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
పార్టీ, ప్రభుత్వ, జాతీయ ప్రజాస్వామ్య కూటమి, వివిధ రాజకీయ పార్టీల స్థాయిలలో విస్తృతంగా చర్చించిన తర్వాతనే లోక్సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరిపే విషయమై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇప్పటికే వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు సగం ముగిశాయని, అయినా ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ అయోధ్య అంశాన్ని పట్టుకునే వేళ్లాడుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధార ఆరోపణలను తిప్పికొట్టడంలో సమర్థంగా వ్యవహరించారని అద్వానీ ప్రధాని వాజ్పేయిని, న్యాయ శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ప్రశంసించారు.
Story first published: Tuesday, August 5, 2003, 23:53 [IST]