వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Pushkaralu Gallery

By Staff
|
Google Oneindia TeluguNews

గోదావరి పుష్కర ఏర్పాట్లనుస్వయంగా పర్యవేక్షిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు బాసర పుష్కర స్నానఘట్టాలను సందర్శించారు. సౌకర్యాల ఏర్పాట్లనుస్వయంగా వీక్షించారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని భక్తులనుస్వయంగా అడిగి తెలుసుకున్నారు. చాలా మంది సంతృప్తిని వ్యక్తం చేశారు.

అయితే, పారిశుద్ద్యపు పనులపై మరింత శ్రద్ద వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తోన్న ఆరోపణలను ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లు, అభివృద్ధి పనుల వల్లే పుష్కరాలకు స్పందన అధికంగా ఉందన్నారు. తెలంగాణలోని ప్రధాన ఘట్టాలైన బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం స్నానఘట్టాల వద్ద ఏర్పాట్లు, అభివృద్ది పనులపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.

మరోవైపు, మంగళవారం నాడు వివిధ పుష్కర ఘట్టాల వద్ద రద్దీ తగ్గింది. శని, ఆది, సోమవారాలతో పోల్చితే అంతటా రద్దీ తగ్గింది. ధర్మపురిలో దాదాపు మూడున్నర లక్షల మందిహాజరయ్యారు. ట్రాఫిక్‌ సమస్యలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X