వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Pushkaralu Gallery
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ లో జరగనున్న ఆఫ్రోఏషియాన్గేమ్స్ వేదికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తెలిపింది. ఈగేమ్స్ ను హైదరాబాద్ లోనే జరపాలని ఎక్కువగా వినతులు వస్తున్నప్పటికీ, న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వేదిక మార్పుపై ఇంకా కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర క్రీడల శాఖ మంత్రివిక్రంవర్మ లోక్ సభలో తెలిపారు.
మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నటి ఢిల్లీ పర్యటనలో వర్మను కలుసుకొని హైదరాబాద్ కుగేమ్స్ ను మార్చాలని వివరించిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రతిష్టాత్మక క్రీడలను ఇక్కడే నిర్వహిస్తామని ముఖ్యమంత్రిఅంటున్నారు. చంద్రబాబు అందుకోసం గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు.
Comments
Story first published: Tuesday, August 5, 2003, 23:53 [IST]