వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాణ్యమైన విత్తనాలకై రైతుల ఆందోళన
కర్నూలు: నాసిరకం విత్తనాలు పంచిపెడుతోన్న ఏపీసీడ్స్ అధికారులపై కర్నూలురైతులు తమ ప్రతాపం చూపారు. నాణ్యమైన విత్తనాలుఅందించేవరకు తాము కదలమని స్థానిక మార్కెట్ యార్డ్ లో ఆందోళన జరిపారు.
తమకు కావాల్సిన గంగా-కావేరి, ఇతర రకాలు కాకుండా, నాసిరకం రకాల విత్తనాలుఅందచేయడాన్ని నిరసిస్తూ రైతులు బుధవారం ఆందోళన జరిపారు. రైతులు పట్టు విడవకుండా స్థానిక బస్టాండ్ వద్ద రాస్తారోకో జరపడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీవో లక్ష్మికాంతం గురువారం నాడు రైతులు కోరిన విత్తనాలుఅందించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చేంతవరకు ఆందోళన జరిపారు.
Story first published: Wednesday, August 6, 2003, 23:53 [IST]