కార్గిల్ కొనుగోళ్లపై పిఎసి నిస్సహాయత
న్యూఢిల్లీ: కార్గిల్ ఆపరేషన్ కోసం చేసిన ఆయుధ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై తన పరిశీలనలను సమర్పించడంలో పబ్లిక్అకౌంట్స్ కమిటీ (పిఎసి) నిస్సహాయత వ్యక్తం చేసింది. ఆయుధ కొనుగోళ్ల వ్యవహారంపైసెంట్రల్ విజిలెన్స్ కమీషన్ (సివిసి) నివేదికను ఇవ్వడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించడంతో పిఎసి తన పరీశీలనలను సమర్పించలేకపోయింది. దేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఇది అనూహ్యమైన సంఘటన.
సివిసి నివేదికను ఇవ్వడానికి రక్షణ మంత్రిత్వ శాఖ తిరస్కరించిన నేపథ్యంలో ఆపరేషన్విజయ్ కోసం చేసిన కొనుగోళ్లపై సమీక్ష జరిపిన కాగ్ నివేదికలోని రక్షణ కొనుగోళ్ల వ్యవహారంపై పరిశీలనలను సమర్పించలేకపోతున్నందుకువిచారిస్తున్నామని పిఎసి చైర్మన్ బూటాసింగ్ తమ నివేదికలో అన్నారు. పిఎసి నివేదికను ఆయన బుధవారం పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించారు.
పార్లమెంటుకు సమర్పించడానికి ముందే పిఎసి నివేదిక బహిర్గతం కావడాన్ని బిజెపి సభ్యులు నిరసించారు. వారి నిరసనల మధ్యనే నివేదికను పార్లమెంటు ఉభయసభలకు సమర్పించారు. సివిసి నివేదికరహస్యమైన, అత్యంత రహస్యమైన పత్రమని, దాన్ని ఇవ్వడం దేశ ప్రయోజనాలకు భంగకరమనిఅంటూ రక్షణ మంత్రిత్వ శాఖ ఆ నివేదికను తమకు ఇవ్వ నిరాకరించిందని పిఎసి నివేదిక వెల్లడించింది.