వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Pushkaralu Gallery
న్యూఢిల్లీ: భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లాఖాన్కు ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి రెండు లక్షల రూపాయల చెక్నుఅందజేశారు. పార్లమెంటు సభ్యుడిగా తనకు వచ్చే నెలసరి వేతనం, అలవెన్సుల మొత్తాన్ని బిస్మిల్లాఖాన్కుఅందజేస్తానని ఆయన బుధవారం చెప్పారు.
బిస్మిల్లాఖాన్సర్వధర్మ సమభావనకు ప్రతీకగా నిలిచిన కళాకారుడని, దశాబ్దాలుగా ఆయన ప్రేమ సందేశాన్ని ప్రచారం చేస్తున్నారని, బిస్మిల్లాఖాన్ గౌరవపాత్రుడని సుబ్బరామిరెడ్డి ప్రశంసించారు. తన దత్త పుత్రిక సోమాఘోష్తో కలిసి బిస్మిల్లాఖాన్ పార్లమెంటు సభ్యుల కోసం ఈ నెల ఏడవ తేదీన ప్రదర్శన ఇస్తున్నారు. ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయడంలో సుబ్బరామిరెడ్డి కీలకపాత్ర పోషించారు.
Comments
Story first published: Wednesday, August 6, 2003, 23:53 [IST]