వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Pushkaralu Gallery
న్యూఢిల్లీ:పీసీసీ అధ్యక్షుడి మార్పు సోనియాగాంధీ మాత్రమే చూసుకుంటారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాంనబీ ఆజాద్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయనపీసీపీ అధ్యక్షుడు ఎం.సత్యనారయణరావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలోవీరు ఇరువురు ప్రత్యేక తెలంగాణ డిమాండ్ గురించి చర్చించారు.
ప్రత్యేక తెలంగాణ అనుకూల, ప్రతికూల వర్గాలకు చెందిన నాయకులతో తాను చర్చించనట్లు ఆజాద్ చెప్పారు. ఎమ్మెస్స్థానిక పరిస్థితులు, అంశాలపై ఆజాద్ తో చర్చ జరిపారు. ఎమ్మెస్ సోనియాతో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతారు.
అయితే, ఆయన తన రాజీనామా పత్రాన్ని కూడా వెంట తీసుకెళ్ళినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆయన పదవిసేఫ్ అనే తెలుస్తోంది. కేవలం ప్రత్యేక తెలంగాణఅంశంపైనే అధిష్టానం ఆయనతో ఇప్పటివరకు చర్చలు జరిపినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Comments
Story first published: Wednesday, August 6, 2003, 23:53 [IST]