వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమ్మె హక్కు లేదు: సుప్రీం తీర్పు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వోద్యోగులకు సమ్మె చేసే హక్కు లేదని సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పును ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాథమిక న్యాయపరంగా గానీ, నైతికంగా గానీ ప్రభుత్వోద్యోగులకు సమ్మె చేసే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తమిళనాడు ప్రభుత్వోద్యోగుల సమ్మెపై జస్టిస్‌ ఎం.బి.షా, జస్టిస్‌ ఎ.ఆర్‌. లక్ష్మణన్‌లతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ప్రకటిస్తూ ఉమ్మడి బేరసారాల హక్కు కలిగిన ట్రేడ్‌ యూనియన్లకు కూడా సమ్మె చేసే హక్కు లేదని స్పష్టం చేసింది. రాష్ట్రం లేదా దేశం ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలను స్తంభింపజేసే లేదా పౌరులకు అసౌకర్యం కలుగజేసే హక్కు రాజకీయ పార్టీలకు గానీ సంఘాలకు గానీ లేదని సుప్రీంకోర్టువివరించింది. తమ డిమాండ్ల సాధించుకునేందుకు ఉద్యోగులకు పలు మార్గాలున్నాయని అభిప్రాయపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X