వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 మంది బారనేరస్థుల పరారీ

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:విజయవాడలోని బాలల పరిశీలనా గృహం (అబ్జర్వేషన్‌ హోమ్‌) నుంచి గురువారం రాత్రి 20 మంది బాలల నేరస్థులు పారిపోయారు.వీరిలో తొమ్మిది మందిని గృహం సిబ్బంది పట్టుకోగలిగారు.

గురువారం రాత్రి హోమ్‌ సిబ్బంది భోజనాలు చేస్తుండగా చువ్వలు వంచి ఈ బాలురు పారిపోయారు.వీరిలో 11 మందిని సిబ్బంది తిరిగి పట్టుకోగలిగారు.వీరు తమ ఇళ్లకు వెళ్లడానికి రైల్వే స్టేషన్‌ వెళ్లారనే సమాచారంఅందడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని 11 మందిని పట్టుకోగలిగారు.విజయవాడలోని రెండంతస్థుల భవంతిలో ఈ జువైనల్‌ హోమ్‌ ఉంది. ఇందులో 15 యేళ్ల లోపు వయస్సు గల బాలనేరస్థులు 40 మంది ఉన్నారు. గతంలో కూడా ఈ హోమ్‌ నుంచి 13 మంది బాలనేరస్థులు పారిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X