వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెస్సార్‌ రాజీనామా ఆమోదం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్ష పదవికి ఎం. సత్యనారాయణ రావు రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ(ఎఐసిసి) అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించారు.

పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణ రావును అకస్మాత్తుగా అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించినవిషయం తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని రెండు రోజుల క్రితం ఢిల్లీకి వచ్చారు.ఆయన ఇక్కడికి చేరుకున్న వెంటనే తనరాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాలఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌కు అందజేశారు.అయితే ఆ లేఖను ఆజాద్‌ తిరస్కరించారు. దీంతోఆయన రాజీనామా వ్యవహారానికి బ్రేక్‌ పడిందనిఅనుకున్నారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌పార్టీ (సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై. యస్‌. రాజశేఖర్‌రెడ్డిని నాయకత్వం ఇక్కడికి పిలిపించింది.

సోనియాను కలుసుకోవడానికి సత్యనారాయణరావుగురువారమంతా నిరీక్షించారు. అయితే ఆయనకు సోనియానుకలిసే అవకాశం రాలేదు. ఆయన శుక్రవారం ఉదయంసోనియాను కలిశారు. సోనియాకు తన రాజీనామాలేఖను అందజేశారు. దాన్ని ఆమె ఆమోదించారు.చాలా కాలంగా పిసిసి అధ్యక్షుడి మార్పు జరుగుతుందనేఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలకుతెరపడింది. కొత్త పిసిసి అధ్యక్షుడెవరనేదిప్రస్తుతం ఉత్కంఠభరితమైన అంశంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X