వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పుష్కర ఘాట్లో పూజారి మృతి
రాజమండ్రి: గోదావరి పుష్కరాల్లో పిండ ప్రదానం చేస్తూ నదిలో పడిపోయి శుక్రవారం ఒక పూజారి మరణించాడు. పుష్కర్ నగర్లో శుక్రవారం స్నానం చేస్తూ అతను నీటిలో పడిపోయాడు. అతడ్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
శుక్రవారం పలువురు ప్రముఖులు గోదావరి పుష్కరాల్లో స్నానాలు చేశారు.విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) నేత అశోక్ సింఘాల్ రాజమండ్రి పుష్కర ఘాట్లో స్నానమాచరించారు. రాష్ట్ర మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు కూడా స్నానం చేశారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్.ఆర్. సుకుమార గోదావరి పుష్కరాల్లో స్నానం చేశారు. పుష్కరాల ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో గోదావరి పుష్కరాలకు భక్తుల రద్దీ విపరీతంగాపెరిగింది.
Comments
Story first published: Wednesday, August 20, 2003, 23:53 [IST]