కల నెరవేరింది: డి.శ్రీనివాస్
కొత్తపీసీసీ అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్ పేరును న్యూఢిల్లీలో గులాం నబీ ఆజాద్ ప్రకటించిన మరుక్షణమే హైదరాబాద్ లోని ఆయనస్వగృహం స్థానిక కాంగ్రెస్ నేతలతో నిండిపోయింది. నిజామాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న డి.శ్రీనివాస్ ప్రస్తుతం డిప్యూటీ సిఎల్పీనేతగా కూడా కొనసాగుతున్నారు. ఇంట్లో ఫోన్,సెల్ ఫోన్ మోగుతూనే ఉన్నాయి. మరోవైపు, మీడియా ప్రతినిధుతులు ఆయన ఇంటర్వ్యూల కోసం ఆయన చుట్టుమూగారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారితో ఆయన ఇంటి వద్ద సందడే సందడి.
ఎప్పటికప్పుడు ఢిల్లీలోని పరిణామాలను ఆయనకు ఉదయం నుంచి ఫోన్ లో సమాచారంఅందుతూనే ఉంది. ఈ కోలాహాలం మధ్య ఆయన కాసేపువిలేకరులతో తన భావాలు పంచుకున్నారు.
థట్స్ తెలుగు.కామ్ ప్రతినిధితో ఆయనమాట్లాడుతూ..నా చిరకాల వాంఛ నెరవేరిందన్నారు.రాష్ట్ర కాంగ్రెస్ లోని అత్యున్నత పదవి పీసీసీ అధ్యక్ష పదవి. అది నిర్వహించాలనేది చిరకాలస్వప్నం. అది నెరవేరినందుకు నిజంగా సంతోషంగా ఉందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు. శ్రావణ శుక్రవారం రోజున నాకు ఈ పదవి దక్కడం ఇంకా ఆనందదాయకంగా ఉంది.
మరి, సీఎం పదవి చేపట్టాలన్నా కోరిక లేదా అని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. అవన్నీ ఇప్పుడెందుకని దాటవేశారు. వై.ఎస్. సన్నిహితఅయినందుకే మీకీ పదవి లభించిందా అని ప్రశ్నించగా, అధిష్టానం బడుగువర్గాలకు పార్టీ పదవులను కట్టబెట్టాలని నిర్ణయించే నాకీ పదవి ఇచ్చిందనుకుంటానని చెప్పారు.
మైనార్టీ, బీసీలు పార్టీ వైపు మొగ్గుచూపేందుకు దోహదపడుతుందన్నారు. అధ్యక్షుడిగా తన తక్షణ కర్తవ్యం పార్టీని ఏకతాటికి తీసుకొచ్చి, వర్గాలకతీతంగా పార్టీనిసమైక్యపరచడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.