వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభివృద్ధికై కలిసి నడుద్దాం: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మలిచేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా, మరింత సమన్వయంతో పనిచేయాలని ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ అన్నారు. పార్టీలకతీతంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలసి అభివృద్ధికై పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. మరో ఇరవై ఏళ్ళ తర్వాత భారత్‌ అమెరికా తదితర అగ్రరాజ్యాల సరసన అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

శనివారం హైదరాబాద్‌ లో మెట్రో రెలును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ..హైదరాబాద్‌ తను ఎప్పుడూ వచ్చిన నిత్యం మరింత ప్రగతి చెందుతూ కన్పిస్తోందని, ఈ విషయంలో బాబును మెచ్చుకోకుండా ఉండలేననిప్రశంసించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన మెచ్చుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చడంలో ముఖ్యమంత్రి చేస్తోన్న కృషిని ఆయన కొనియాడారు. అయోధ్యలో గుడిపై చట్టం చేయడం ప్రస్తుత పరిస్థితిలో కుదరదని అద్వానీ స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X