మెట్రో రైలుకు అద్వానీ పచ్చజెండా
హైదరాబాద్: జంటనగరాల ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మల్టీ మోడల్ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ శనివారం ప్రారంభించారు. అద్వానీ శనివారం ఉదయం హైదరాబాద్కు వచ్చారు. బేగంపేటవిమానాశ్రయం నుంచి ఆయన నేరుగా సికింద్రాబాద్రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
పెరుగుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల రద్దీని దృష్టిలోపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్కు రూపకల్పన చేసింది. మొదటి దశలో సికింద్రాబాద్ నుంచి లింగపల్లికి, హైదరాబాద్ నుంచి లింగపల్లికి ఈ మెట్రోరైళ్లు నడుస్తాయి. ఈ తొలి దశ మెట్రోరైళ్లు శనివారం ప్రారంభమయ్యాయి. మొత్తం 43 కిలోమీటర్ల దూరం మల్టీ మోడల్ట్రాన్స్పోర్టు సిస్టమ్ ప్రస్తుతం 28.50 కిలోమీటర్ల దూరం మేరకు పూర్తయింది.
తొలి మెట్రోరైలు 16 స్టేషన్లను కలుపుతూ ఈ దూరంలో ప్రయాణిస్తుంది.అరగంటకు ఒక రైలు నడుస్తుంది. ఇప్పటికే మూడురైళ్లను చెన్నై నుంచి తెప్పించారు. మరో 8రైళ్లు త్వరలో వస్తాయి. ఈ రైళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి పదకొండుంబావు వరకు నడుస్తాయి. ఈరైళ్ల స్టేషన్ల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయడానికి ఆర్టీసి బస్సులుస్టేషన్ల వెలుపల సిద్ధంగా ఉంటాయి.