వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్కు బయలుదేరిన ఎంపిలు
న్యూఢిల్లీ: వివిధ రాజకీయ పార్టీలకు చెందిన భారత పార్లమెంటు సభ్యుల బృందం శనివారం పాకిస్థాన్కు బయలుదేరి వెళ్లింది. మూడు రోజుల పాటు పాకిస్థాన్లో పర్యటించే పార్లమెంటు సభ్యుల బృందంలో జర్నలిస్టులు కూడా వున్నారు.
పార్లమెంటు సభ్యులు, జర్నలిస్టులు శనివారం అమృతసర్ నుంచి రైలులో బయలుదేరారు. వారు వాఘా చెక్పోస్టు నుంచి కాలినడకన పాకిస్థాన్లోకి చేరుకుంటారు. భారత పార్లమెంటు సభ్యులు పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ను, రాజకీయ నాయకులను, సామాజిక ప్రతినిధులను కలుసుకుంటారు.
పాకిస్థాన్కు బయలుదేరిన బృందంలో 20 మంది పార్లమెంటు సభ్యులు, 10 మంది జర్నలిస్టులు ఉన్నారు. లల్లూ ప్రసాద్ యాదవ్ (ఆర్జెడి), రామ్ విలాస్ పాశ్వాన్, మణిశంకర్ అయ్యర్ తదితరులు ఉన్నారు.
Comments
Story first published: Saturday, August 9, 2003, 23:53 [IST]