నా పూర్వజన్మ సుకృతం: బాబు
రాజమండ్రి: గోదావరి పుష్కరాలు కుంభమేళాను తలపించాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గోదావరి పుష్కరాల ముగింపు రోజయిన ఆదివారంనాడు ఆయన రాజమండ్రి, నర్సాపురంలలో పర్యటించారు. గత నెల 30వ తేదీన గోదావరి పుష్కరాలను చంద్రబాబు ప్రారంభించారు.
రాజమండ్రిలో ఆయన ఆదివారంనాడుఅశేష భక్త జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. గోదావరి పుష్కరాలను సమర్థంగా నిర్వహించి చరిత్ర సృష్టించామని ఆయన అన్నారు. ప్రజల్లో భక్తిభావననుపెంపొందించడానికి గోదావరి పుష్కరాలు దోహదం చేశాయని ఆయన అన్నారు. తన హయాంలో గోదావరి పుష్కరాలు మొదటిసారి కనీవినీ ఎరుగని రీతిలోవిజయవంతం కావడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. పవిత్ర భావనతో ఏ పని చేసినావిజయం సాధిస్తాయనడానికి గోదావవరి పుష్కరాలే నిదర్శనమని ఆయన నర్సాపురంలో అన్నారు. ఆయన గౌతముడివిగ్రహాన్ని ఆవిష్కరించారు.
గోదావరి పుష్కరాలు సమర్థంగా పని చేయడానికి వివిధ శాఖలకు చెందిన 35 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 8,500 మంది పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమయ్యారు. మొత్తం ఐదు కోట్ల మంది భుక్తులు పుణ్యస్నానాలు చేశారనిఅంచనా.