వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా పూర్వజన్మ సుకృతం: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: గోదావరి పుష్కరాలు కుంభమేళాను తలపించాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గోదావరి పుష్కరాల ముగింపు రోజయిన ఆదివారంనాడు ఆయన రాజమండ్రి, నర్సాపురంలలో పర్యటించారు. గత నెల 30వ తేదీన గోదావరి పుష్కరాలను చంద్రబాబు ప్రారంభించారు.

రాజమండ్రిలో ఆయన ఆదివారంనాడుఅశేష భక్త జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. గోదావరి పుష్కరాలను సమర్థంగా నిర్వహించి చరిత్ర సృష్టించామని ఆయన అన్నారు. ప్రజల్లో భక్తిభావననుపెంపొందించడానికి గోదావరి పుష్కరాలు దోహదం చేశాయని ఆయన అన్నారు. తన హయాంలో గోదావరి పుష్కరాలు మొదటిసారి కనీవినీ ఎరుగని రీతిలోవిజయవంతం కావడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. పవిత్ర భావనతో ఏ పని చేసినావిజయం సాధిస్తాయనడానికి గోదావవరి పుష్కరాలే నిదర్శనమని ఆయన నర్సాపురంలో అన్నారు. ఆయన గౌతముడివిగ్రహాన్ని ఆవిష్కరించారు.

గోదావరి పుష్కరాలు సమర్థంగా పని చేయడానికి వివిధ శాఖలకు చెందిన 35 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 8,500 మంది పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమయ్యారు. మొత్తం ఐదు కోట్ల మంది భుక్తులు పుణ్యస్నానాలు చేశారనిఅంచనా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X