వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎడ్‌సెట్‌లో 81 శాతం పాస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఎడ్‌సెట్‌లో 81 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. బి.ఇడి.లో ప్రవేశం కోసం గత నెల నిర్వహించిన ప్రవే పరీక్ష (ఎడ్‌సెట్‌) ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ అనంతస్వామి ఆదివారంనాడు విడుదల చేశారు.

రాష్ట్రంలోని 270 కాలేజీల్లో 2700 సీట్లున్నాయి. ఇందులో ప్రవేశం కోసం 2,75,770 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2 లక్షల 48 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 2 లక్షల 18 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. వివిధ కోర్సులలో కిశోర్‌, సూర్య సుబ్రహ్మణ్యం, రెంటాల వి. లక్ష్మీవల్లి, నాగభూషణం ప్రథమ స్థానాలు సాధించారు. అభ్యర్థులకు పది రోజుల్లో ర్యాంక్‌ కార్డులు పంపిస్తామని అనంతస్వామి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X