వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌కు వాజ్‌పేయి హితవచనాలు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌, భారత్‌ల మధ్య హింస, సంఘర్షణలు ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపలేవని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. ఉభయ దేశాలు పరస్పరం మనుగడ సాగించుకునే పద్ధతి అవలంభించాలని ఆయన అన్నారు.

హింస, రక్తపాతం పరిష్కారాలు చూపలేవని, పరస్పరం మనుగడ సాగించుకునే పద్ధతిని అవలంభిస్తేనే ఇరు దేశాలు కలిసి ముందుకు సాగుతాయని ఆయన అన్నారు. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో భారత పార్లమెంటు సభ్యులు, జర్నలిస్టులు హాజరైన శాంతి సమావేశంలో వాజ్‌పేయి ప్రకటనను చదివారు. ఉమ్మడి సమస్యలకు సంఘర్షణ కన్నా పరస్పర సహకారమే సమాధానం చూపగలదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X