బాబు లెవ్ ప్రసంగం: వినూత్నం
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ రంగంలో, పాలనారంగంలో కొత్త ధోరణులకుశ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం దేశ రాజకీయాల్లోసరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలందరితో నేరుగా మాట్లాడేందుకువీలుగా టీవీని ఉపయోగించుకున్నారు. సోమవారం ఓ ప్రైవేట్ ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు స్థానిక కార్యకర్తలు, బూత్ కమిటీ నాయకులతో నేరుగా మాట్లాడారు.
వారు ఆయా ప్రాంతాల సమస్యలను ఏకరవుపెట్టారు. ముఖ్యమంత్రి నేరుగా టీవీలో వారితో మాట్లాడుతూనే..సంక్షిప్తంగా తన నోట్ బుక్ (ల్యాప్టాప్)లో నోట్ చేసుకున్నారు. ప్రతినెలా సోమవారం నాడు ఈ ప్రత్యక్ష ప్రసారం ఉంటుందిఇక.
ఒక రాజకీయ పార్టీ నేత ఇలా తన పార్టీ అధ్యక్ష ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయించుకోవడం, పార్టీ కార్యకర్తలను ప్రత్యక్షంగా టీవీ ద్వారా మాట్లాడడం దేశంలో ఇదే ప్రథమం. దీని ద్వారా ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారాన్ని ఇప్పట్నుంచే మొదలుపెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.