వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్యకర్తలకు బాబు టీవీ పిలుపు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ చేస్తున్నవిమర్శలను తిప్పి కొట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ బూత్‌ కమిటీలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఒక ప్రైవేట్‌ టీవీ చానల్‌ ద్వారా ఎన్టీర్‌ ట్రస్టు భవనం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పార్టీ బూత్‌ కమిటీలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రైవేట్‌ టీవీ చానల్‌ ప్రసంగాలను ప్రారంభించడం ద్వారా ఆయన పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడం మొదలుపెట్టారని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన తన ప్రసంగంలోవివరించారు. వీటిని ప్రజల్లోకి తీసికెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ నెలవారీ కార్యక్రమాల గురించి కూడా ఆయన పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు.

రైతులకు ఉచిత విద్యుత్‌ అనేది నినాదమే తప్ప ఆచరణ సాధ్యం కాదని ఆయన చెప్పారు. కర్ణాటక ఆగడాలను కూడా ప్రజల్లోకి తీసికెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఉచితంగావిద్యుత్‌ అందించడం లేదని, ఇక్కడ ఉచితంగావిద్యుత్‌ అందిస్తామని అంటున్నారని, దీన్ని ఎవరూ నమ్మరని ఆయన అన్నారు. కర్ణాటక ఆగడాలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి జరపనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X