వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెప్సీపై కేంద్రానికి ఢిల్లీ కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ:పెప్సీ నమూనాలపై పరీక్షలు నిర్వహించి, మూడు వారాల లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.పెప్సీ నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలలో పరీక్షించాలని జస్టిస్ బి.డి. అహ్మద్ సాలిసిటర్ జనరల్కె.కె. సూద్కు సూచించారు.
నష్టదాయకమైన సిఎస్ఇ నివేదికస్వతంత్ర విశ్లేషణను కోరూత పెప్సికో ఇండియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, దాని బాటిలర్ పియర్ల్ డ్రింక్స్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. సిఎస్ఇ ప్రయోగశాలకు గుర్తింపు లేదని,విశ్లేషణ పద్ధతులు, ప్రక్రియ అనుమానాస్పదంగా ఉన్నాయని ఆ పిటిషనల్లో ఆరోపించారు. సిఎస్ఇ నివేదికలోని నిజానిజాలను తేల్చుకోకుండాపెప్సీ ఉత్పత్తులను నిలిపివేతకు ప్రభుత్వం ఆదేశించడాన్ని ఆ పిటిషన్లో సవాల్ చేశారు.
Comments
Story first published: Monday, August 11, 2003, 23:53 [IST]