వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశమంతటా వైభవంగా రక్షాబంధనం
హైదరాబాద్: రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) ఉత్సవాన్ని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ చేసుకున్నారు. హైదరాబాద్ నగరమంతా రంగురంగుల రాఖీ దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. సోదరీమణుల రాఖీలు, సోదరులు గిప్ట్ లు పంచుకోవడం,స్వీట్ షాప్ లకు గిరాకీ..ఇవీ రాఖీ పండుగ నాడు ప్రధానంగా కన్పించే దృశ్యాలు.
ఉత్తరభారతం నుంచే ఈ సంప్రదాయం వచ్చినప్పటికీ ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ఈ సంప్రదాయం పాతుకుపోయింది. రాష్ట్రమంతటా ప్రజలు రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు.
ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాఖీ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జైళ్ళలో ఖైదీలకు స్కూలు పిల్లలు రాఖీలు కట్టారు.
Comments
Story first published: Tuesday, August 12, 2003, 23:53 [IST]