వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

41 మందీ వైదొలగాలిః టిడిఎఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః తెలంగాణ పట్లకాంగ్రెస్‌ అధిష్టానవర్గం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాజీనామా చేసిన తెలంగాణకాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జి.చిన్నారెడ్డి, బి.సారయ్య,ఇంద్రకరణ్‌ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డిలనుఎన్నారై సంస్ధ తెలంగాణ డెవలప్‌ మెంట్‌ ఫోరం ఒక ప్రకటనలో అభినందించింది. తెలంగాణకు ప్రత్యేక పిసిసి ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ను పక్కకు పెట్టడం ద్వారా కాంగ్రెస్‌ అధిష్టానవర్గం తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుందని ఫోరం విమర్శించింది.

ఉత్తర అమెరికాలో ఉన్న తెలంగాణ శ్రేయోభిలాషుల సంఘమైన తెలంగాణాడెవలప్‌ మెంట్‌ ఫోరం తెలంగాణ ప్రయోజనాలనుదృష్టిలో ఉంచుకుని 41 మంది ఎమ్మెల్యేలు రాజీనామాచేయాలని సూచించింది. నిజమైన అధికారం పిసిసి అధ్యక్షుడివద్ద ఉండదని, అదెప్పుడూ ఆంధ్రా కాంగ్రెస్‌ నాయకులచేతుల్లోనే ఉంటుందని కొత్త పిసిసి అధ్యక్షుడుడి.శ్రీనివాస్‌ గ్రహిస్తే మంచిదని ఫోరంపేర్కొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X