వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒక తాటి మీద నడుపుతా: డిఎస్
హైదరాబాద్: కాంగ్రెస్లోని గ్రూపు విభేదాలను రూపుమాపిఅందర్ని ఒకతాటి మీదికి తేవడమే తన ప్రథమ లక్ష్యమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) నూతన అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తనను పిసిసి అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఢిల్లీ వెళ్లిన శ్రీనివాస్ బుధవారం ఉదయం ఇక్కడికి తిరిగి వచ్చారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీవిజయం సాధించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని,అందర్ని కలుపుకొని పోతానని ఆయన చెప్పారు. ఆయన హైదరాబాద్ బేగంపేటవిమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అయితేవిమానాశ్రయానికి పార్టీ సీనియర్ నాయకులు ఎవరూ రాలేదు. పిసిసి అధ్యక్షుడిగా ఆయన బుధవారం ఉదయమే పదవీ బాధ్యతలుస్వీకరించారు. ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా పార్టీ కార్యాలయం గాంధీభవన్కు ఊరేగింపుగా వెళ్లారు.
Comments
Story first published: Wednesday, August 13, 2003, 23:53 [IST]