తెలంగాణకు కట్టుబడి ఉన్నా: డిఎస్
హైదరాబాద్: వ్యక్తిగతంగాతాను ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉన్నాననిబుధవారం పీసీసీ అధ్యక్షుడిగా లాంఛనంగా బాధ్యతలుస్వీకరించిన ధర్మపురి శ్రీనివాస్ స్పష్టంచేశారు. అయితే, తాను గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ..సంతకంచేయలేదని వివరించారు. అలా వచ్చిన వార్తలునిరాధరమైనవని ఆయన విలేకరులసమావేశంలో తెలిపారు.
ఎమ్మెస్సార్ కు వీడ్కోలు, లాంఛనంగా బాధ్యతలస్వీకరణ అనంతరం డిఎస్ విలేకరులసమావేశంలో మాట్లాడారు. తెలంగాణపైకాంగ్రెస్ వైఖరి ఎమిటని పలువురు విలేకరులఅడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..హైకమాండ్ ఇష్టానుసారుమే..తానునడుచుకుంటానని చెప్పారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూకాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంసాధ్యమవుతుందన్నారు. తెలంగాణపై తానుద్వంద్వ వైఖరి అవలంభించడం లేదని వివరణఇచ్చారు. కాంగ్రెస్ లో గనుక తాను పూర్తిగా ఐక్యతసాధిస్తే..చంద్రబాబును ఓడించడం సాధ్యమే కాకుండా..పూర్తిగాఅన్ని స్థానాలను కాంగ్రెసే కైవసం చేసుకోగలదనిఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.