వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్వాతంత్ర్య దినోత్సవం: భద్రతా కట్టుదిట్టం
న్యూఢిల్లీ: శుక్రవారం నాటిస్వాతంత్ర్య దినోత్సవాలను భగ్నం చేయడానికి తీవ్రవాదులు పన్నాగం పన్నే అవకాశం ఉందన్న ఇంటిలెజిన్స్ నివేదికలను ఆధారంగా ఎర్రకోట వద్దపెద్ద ఎత్తున భద్రతాదళాలను మోహరించారు. దాదాపు 70 వేల మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. మునుపెన్నడూ లేనంతగా భదత్రను కట్టుదిట్టం చేశారు.
న్యూఢిల్లీసరిహద్దుల వద్ద అన్ని రోడ్లను బ్లాక్ చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు,స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురష్కరించుకొని రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం గురువారం దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరజవాన్లకు నివాళులుఅర్పించారు.
ఆనవాయితీకి భిన్నంగా ఆయన ఒకరోజు ముందుగానే నివాళులు అర్పించడంవిశేషం. రాష్ట్రపతి దేశప్రజలను ఉద్దేశించిన ప్రసంగంలో మతతత్వ శక్తులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Comments
Story first published: Thursday, August 14, 2003, 23:53 [IST]