వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎసిపై అదే వరుస- లోక్‌సభ వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పబ్లిక్‌అకౌంట్స్‌ కమిటీ (పిఎసి)కి సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌(సివిసి) నివేదికను ఇవ్వాలనే విపక్షాల డిమాండ్‌ వల్ల తలెత్తినసంక్షోభాన్ని నివారించడానికి లోక్‌సభ స్పీకర్‌ మనోహర్‌ జోషీ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంవిఫలమైంది. విపక్షాల డిమాండ్‌తో గత కొద్ది రోజులుగా లోక్‌సభ కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి.

సివిసి నివేదికను వెల్లడి చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని కాంగ్రెస్‌ ప్రకటించింది. కాంగ్రెస్‌ వైఖరినిమిగతా ప్రతిపక్షాలు సమర్థించాయి. ఒక జర్నలిస్టుకు నివేదికను ఇచ్చినప్పుడు సివిసికి ఇవ్వడానికి అభ్యంతరాలేమిటని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈవిషయమై తాము సభలో చర్చకు సిద్ధమేనని, అయితే ఈ చర్చకువిపక్షాలు కోరినట్లు ప్రధాని జవాబు ఇవ్వరని, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ సమాధానం ఇస్తారని బిజెపిఅంటోంది. దీనికి కాంగ్రెస్‌ అంగీకరించడం లేదు.

అఖిల పక్ష సమావేశం విఫలం కావడంతో కార్గిల్‌ ఆయుధ కొనుగోళ్లపై పిఎసి నివేదిక వ్యవహారం గురువారంనాడు కూడా లోకసభను కుదిపేసింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాకుండానేవిపక్షాలు ఆందోళనకు దిగాయి. సివిసి నివేదికను పిఎసికి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతా దళ్‌ సభ్యులు సభ మధ్యలోకి దూసుకెళ్లారు. దీంతోస్పీకర్‌ సభను గంట సేపు వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X