వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్థిక స్వేచ్ఛకు పోరు: చంద్రబాబు
హైదరాబాద్: ఆర్థికస్వాతంత్ర్యం కోసం మరో సంగ్రమానికి సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఆయన శుక్రవారం జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రజలు కృషి చేస్తే గడువు కన్నా ముందేస్వర్ణాంధ్రను సాధించగలమని ఆయన అన్నారు.
మతసామరస్యాన్ని కాపాడడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ఆయన చెప్పారు. నక్సలైట్లు తీవ్రవాదాన్ని విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కర్ణాటక అనుసరిస్తున్న వైఖరిని ఆయన విమర్శించారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు.
Comments
Story first published: Friday, August 15, 2003, 23:53 [IST]