వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ విచారించక తప్పదు: వెంకయ్య
న్యూఢిల్లీ: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రతిపాదించినఅవిశ్వాస తీర్మానం వీగిపోతుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన శుక్రవారం పార్టీసీనియర్ నేతలతో చర్చించారు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందుకు కాంగ్రెస్ చింతించక తప్పదని ఆయన సమావేశానికి ముందు విలేకరులతో అన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో అది ప్రతిపక్షాల హక్కు అని, దాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. సివిసి నివేదికను పిఎసికి ఇవ్వకపోవడంపై గందరగోళం సృష్టించడం అనవసరమైన చర్య అని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్, వామపక్షాలు వృధా చేస్తున్నాయని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, August 15, 2003, 23:53 [IST]