వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవిశ్వాసం: ఎన్డీయే పూర్తిగా సిద్ధం!
న్యూఢిల్లీ: సోమవారం నాటిఅవిశ్వాస తీర్మానాన్ని సమర్ధంగా తిప్పికొట్టేందుకు ఎన్డీఏ కూటమి సిద్దమైంది. శనివారం వాజ్పేయి అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో మిత్రపక్షాలన్ని మద్దతు పలకడమే కాకుండా, ఏఐడిఎంకే కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది.
మరోవైపు, రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ చర్చలో ప్రసంగించాలని నిర్ణయించారు. సివిసి నివేదికపై రేగిన దుమారానికికారకుడైన ఫెర్నాండెజ్ అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొంటాననడంవిశేషం. విపక్షాలను సమర్ధంగా తిప్పికొట్టి, మా బలం ఏమిటో నిరూపించుకుంటామని ఫెర్నాండెజ్విలేకరులతో ధీమాగా చెప్పారు. అవసరమైతే, ఏఐడిఎంకే సభ్యుల మద్దతును కూడా సంపాదిస్తామని ఆయన తెలిపారు.
Comments
Story first published: Saturday, August 16, 2003, 23:53 [IST]