వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం, 5గురి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:విజయవాడలో శనివారం తెల్లవారుఝామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.బ్రిడ్జిపై కూడా లారీ డ్రైవర్‌ వేగంగా నడపడం వల్ల స్టీరింగ్‌ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

విశాఖపట్నం నుంచి వస్తోన్న ఓ లారీ ఐదో నంబర్‌ జాతీయ రహదారిలో కనకదుర్గమ్మ బ్రిడ్జి వద్ద అదుపుతప్పింది. అది నేరుగా రోడ్డు పక్కన ఉన్న నిద్రిస్తోన్న కూలీలపై వెళ్ళి పక్కనున్న ఓ ట్రక్కును ఢీకొంది. కూలీల్లో ముగ్గురు, ట్రక్కులో నిద్రిస్తోన్న వ్యక్తితో పాటు లారీలో ఉన్న ఓ ఐదేళ్ళ బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ బాలుడి తండ్రితో పాటు మరో మహిళ ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా నడుపుతూ..లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే వల్ల ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X