వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, 5గురి మృతి
విజయవాడ:విజయవాడలో శనివారం తెల్లవారుఝామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.బ్రిడ్జిపై కూడా లారీ డ్రైవర్ వేగంగా నడపడం వల్ల స్టీరింగ్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
విశాఖపట్నం నుంచి వస్తోన్న ఓ లారీ ఐదో నంబర్ జాతీయ రహదారిలో కనకదుర్గమ్మ బ్రిడ్జి వద్ద అదుపుతప్పింది. అది నేరుగా రోడ్డు పక్కన ఉన్న నిద్రిస్తోన్న కూలీలపై వెళ్ళి పక్కనున్న ఓ ట్రక్కును ఢీకొంది. కూలీల్లో ముగ్గురు, ట్రక్కులో నిద్రిస్తోన్న వ్యక్తితో పాటు లారీలో ఉన్న ఓ ఐదేళ్ళ బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ బాలుడి తండ్రితో పాటు మరో మహిళ ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా నడుపుతూ..లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే వల్ల ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Story first published: Saturday, August 16, 2003, 23:53 [IST]