వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాసం: వాజ్‌పేయికి దేశం అండ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమికి అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. వాజ్‌పేయి ప్రభుత్వంపై సోమవారం ప్రతిపక్షాలు ప్రతిపాదించేఅవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ఓటు చేయనుంది.

ఎన్‌డిఎ ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్న తెలుగుదేశంతో పాటు బహు జనసమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) కూడా అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికార ప్రతినిధి వి.కె. మల్హోత్రా చెప్పారు. ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీల సమావేశానంతరం ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ రెండు పార్టీల మద్దతుతో అన్నాడియంకె మద్దతు లేకున్నా ఎన్‌డిఎకు 323 మంది సభ్యుల బలం వుంటుందని ఆయన చెప్పారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వానికి మద్దతుగా నిలబడటమే కాకుండా వివిధ అంశాలపై ఎన్‌డిఎ పక్షాలు ప్రతిపక్షాలపై ఎదురు దాడికి దిగుతాయని ఎన్‌డిఎ కన్వీనర్‌ జార్జి ఫెర్నాండెజ్‌ సమావేశానంతరం విలేకరులతో అన్నారు.
ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన ఎన్‌డిఎ సమావేశానికి తమిళనాడుకు చెందిన డిఎంకె హాజరైంది. ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ, ఎన్‌డిఎ కన్వీనర్‌, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌, బిజెపి అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఇదిలా వుంటే, అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ పార్టీ సీనియర్‌ నేతలతో సంప్రదింపులు జరిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X