వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఛీఫ్ లిక్కర్ తాగి 4గురి మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలో ఛీఫ్ లిక్కర్సేవించి నలుగురు మరణించారు. మరో ఆరుగురు తీవ్రఅస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.
ఆదివారం ఉదయం స్థానికఊర్వశి బార్ లో మద్యం సేవించిన వెంటనే పలువురుఅస్వస్థతకు గురయ్యారు. ఇందులో నలుగురు కనకయ్య, సత్యం అనే ఇద్దరు వెంటనే చనిపోయారు. చనిపోయిన మరో ఇద్దరిని పోలీసులు ఇంకా గుర్తించలేదు.
మిగతా ఆరుగురిని ఆసుపత్రిలో చేర్పించారు.ఎక్సైజ్ అధికారులు ఈ బార్ ను సీజ్ చేశారు. యజమానినిఅరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Story first published: Sunday, August 17, 2003, 23:53 [IST]