వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయి ప్రభుత్వం నెగ్గుతుంది: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వాజ్‌పేయి ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడంపై ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు తీవ్రంగా విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై వాజ్‌పేయి ప్రభుత్వంగెలిచి తీరుతుందని ఆయన చెప్పారు. ప్రతిదాన్ని కాంగ్రెస్‌ రాజకీయ చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ నివేదికను ఆసరా చేసుకుని పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని ఆయన అన్నారు. ఈ దృష్ట్యా తాము అవిశ్వాస తీర్మానాన్ని ఓడించేందుకు కట్టుబడి పని చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.

తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరాల సందర్భంగా ఆయన సోమవారం ఒక ప్రైవేట్‌ చానల్‌ ద్వారా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.బలహీనవర్గాలకు తమ పార్టీసరైన సేవలు అందిస్తోందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడునారా చంద్రబాబునాయుడు చెప్పారు.

కాంగ్రెస్‌ అవినీతిని, ఆశ్రిత పక్షానికి విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని ఆయన చెప్పారు. బలహీనవర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేసినంత కాలం తమ పార్టీకి ఢోకా లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X