వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రికి ప్రతిదీ మోడలే!?

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు, హైదరాబాద్‌: గుంటూరులో చౌకబారు మద్యంఏరులై పారుతోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జిల్లాల్లో నలుగురు చౌకబారు మద్యంసేవించి మరణించారు. తాడేపల్లి గ్రామంలో బుధవారం ఉదయం ఒక వ్యక్తి మృతి చెందగా, మంగళగిరిలో గతరాత్రి ముగ్గురు మరణించారు. జిల్లాల్లోని అన్ని మద్యం షాపులను అధికారులు మూసివేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకవిచారణకు ఆదేశించారు.

బుధవారం ఆయన జిల్లాఎక్సైజ్‌, పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు. అయితే, ఈ మృతుల కారణాలకు కారణం ఏమిటో అధికారులకు అంతు చిక్కకుండా ఉంది. నాలుగురోజుల్లో చౌకబారు మద్యంసేవించి జిల్లాల్లో తొమ్మిది మంది మృతి చెందారు. అయితే, ఇవీ అక్కడా అక్కడా..జరుగుతోన్న ఘటనలుగాఎక్సైజ్‌ అధికారులు అభివర్ణిస్తున్నారు.

ఫలానాబ్రాండ్‌ మద్యం సేవించడం వల్లనో, లేక ఫలానా బార్‌ లో సేవించడం వల్లనో జరుగుతుందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే..రోజుకు వందలాది మంది సేవిస్తున్నప్పుడు స్పోర్డక్‌ గా జరుగుతోన్న ఘటనలకు లంకె కుదరడం లేదనిఎక్సైజ్‌ కమీషనర్‌ అభిప్రాయపడ్డారు.

జిల్లా ఎస్పీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ మాట్లాడుతూ..ఘటనలు జరిగిన బార్లన్నింటినిసీజ్‌ చేశాం. అలాగే గోల్డ్‌ మైన్‌ అనే బ్రాండ్‌ మద్యాన్ని ఇక్కడ అధికంగా తీసుకుంటున్నట్లు తెలిసింది. దానిపై దృష్టిపెట్టాం. అయితే, ఇదంతా ప్రాథమిక సమాచారం. పూర్తివిచారణ జరిగాక గానీ, ఏ విషయం చెప్పలేమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X