వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారీ భద్రత, కొనసాగుతోన్న నిమజ్జనం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషిపై అభియోగాలు నమోదు చేయాలనే రాయ్బరేలీ కోర్టు తీర్పుపై అలహాబాద్ హైకోర్టుస్టే ఇవ్వడం పట్ల భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. బాబ్రీ కూల్చివేత కేసు రాజకీయపరమైందని, ఈ కేసును రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కుంటామని ఆయన మంగళవారంవిలేకరులతో చెప్పారు.
బిజెపి నాయకులపైపెట్టిన ఈ కేసు తమకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటూ వస్తున్నామని, తమఅంచనాలు నిజమవుతున్నాయని ఆయన అన్నారు. లక్నో బెంచ్స్టే ఆర్డర్ వెలువడిన వెంటనే వెంకయ్యనాయుడు ప్రధాని వాజ్పేయితో మాట్లాడారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ వెంటనే జోషినికోరారు. బాబ్రీ కేసులో ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పార్టీ మొదటి నుంచి చెబుతూ వస్తోందని ఆయన గుర్తు చేశారు.
Comments
Story first published: Friday, September 19, 2003, 23:53 [IST]